విజయశాంతి బీజేపీలో చేరుతారు: బండి సంజయ్

  • వరద సాయాన్ని ఆపాలంటూ నేను లేఖ రాయలేదు
  • ఆ సంతకం నాదికాదు, ఫోర్జరీ చేశారు
  • ప్రభుత్వం మరీ ఇంత నీచానికి దిగజారుతుందనుకోలేదు
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. వరద సాయాన్ని ఆపాలంటూ ఎన్నికల సంఘానికి తాను లేఖ రాసినట్టు వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన.. తాను రాసినట్టు ఉన్న లేఖలోని సంతకం తనది కాదని, దానిని ఫోర్జరీ చేశారని అన్నారు.

ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆ లేఖను ఎవరు రాశారు? అందులోని సంతకం ఎవరిదన్న విషయం తేలాల్సిందేనన్నారు. తాను గతంలో ముఖ్యమంత్రికి రాసిన లేఖపై సంతకాన్ని చూస్తే, ఇప్పటి సంతకం నకిలీదని ఇట్టే గుర్తుపట్టవచ్చన్నారు. వరద సాయం పంపిణీకి బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అయితే, ఈ మాత్రంతో సరిపెట్టకుండా నష్టానికి పూర్తి పరిహారం ఇవ్వాలని బీజేపీ మొదటి నుంచీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు సంతకాలు ఫోర్జరీ చేసే స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయిందని బండి సంజయ్ ఆరోపించారు.

BJP
Bandi Sanjay
TRS
GHMC Elections
Hyderabad

More Telugu News